Mane Praveen

1 hour and 1 min ago

TG: ఏప్రిల్ 30న పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. 

తెలంగాణ విద్యాశాఖ పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు సిద్దమైంది.రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యాశాఖ దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో ఎగ్జామ్స్ నిర్వహించింది.

అక్కడక్కడా కొన్ని మాల్‌ ప్రాక్టీసింగ్ సంఘటనలు చవిచూసినటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా సజావుగా పరీక్షలను నిర్వహించారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన మరుక్షణం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Mane Praveen

2 hours and 50 min ago

NLG: మర్రిగూడ మండలంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సిపిఎం నాయకులు.

పార్లమెంటు ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి , నిర్వీర్యం చేసే పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుపాలడుగు నాగార్జున అన్నారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో జీఎస్టీ పేర ప్రజలపై అధిక పన్నులు మోపిందని ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందని పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచి పెట్టిందని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. దేశంలో సమతుల్యత లేని అభివృద్ధిని మోడీ చేస్తున్నారని దక్షిణ భారతదేశంలో నిధుల కేటాయింపులు, నీటి కేటాయింపులు ప్రాజెక్టుల నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం లేదని ఆరోపించారు. తీవ్రమైన నిర్లక్ష్యం వివక్షత చూపుతున్నారని తెలిపారు. కేవలం అంబానీ ఆధానీల మెప్పు కోసమే దేశ సంపదను లూటీ చేస్తున్నారని అన్నారు. జీరో అకౌంట్ ద్వారా 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామనే మాట జూట అని అన్నారు. 

ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పంటలకు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. ఏకకాలంలో పంటల రుణమాఫీ రెండు లక్షలు చేయాలని ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని తెలియజేశారు. ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి పేద ప్రజల పక్షాన నికరంగా పోరాడే అభ్యర్థి జహంగీర్ అని అన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేసి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కాగు వెంకటయ్య, చెల్లం ముత్యాలు, నారోజు అంజయ్య,బుర్రి పెంటయ్య, లక్షమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 24 2024, 09:48

NLG: పేదింటి బిడ్డ పెళ్లికి సాయం అందించిన ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం, మాల్ పట్టణంలోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు సేవలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నల్లవెల్లి గ్రామానికి చెందిన జోగు చంద్రయ్య అంధుడు మరియు పేదరికంలో ఉన్నాడు. ఆయన చిన్న కూతురు వివాహానికి ఫౌండేషన్ చైర్మన్ ముత్తు రూ.10,000 ఆర్థిక సహాయంగా అందించారు.

ఈ సందర్బంగా ముత్తు మాట్లాడుతూ.. తన తండ్రి పేరున ఉన్న ఈ ఫౌండేషన్ పేదలకు సహాయాన్ని అందిస్తుందని, ఆకలితో ఉన్న వారికి అండగా ఉంటుందని, ఎవరికి సహాయం కావాలన్నా తమ ఫౌండేషన్ ను సంప్రదించాలని అన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 23 2024, 18:24

13-14 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ:13,14 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ.. రేపు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

కెసిఆర్ నల్లగొండ జిల్లాను నాశనం చేశారని,కేసీఆర్ వల్లనే జిల్లాకి కరువు వచ్చిందని,నీటి జలాలు పంపకంలో జగన్,కేసీఆర్ లాలూచీ పడ్డారని మండి పడ్డారు.భారాస ఒక్క సీట్ కూడా గెలవదని జోష్యం చెప్పారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 22 2024, 19:35

బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ కు అధిక సంఖ్యలో తరలిరండి: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రేపటి నామినేషన్ కార్యక్రమానికి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. భువనగిరి కోట మీద ఎగిరేది బిజెపి జెండానే అని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్. జయశంకర్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు,ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పాల్గొననున్నారని తెలిపారు. జిల్లా నుండి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీలో పాల్గొనాలని కోరారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 22 2024, 18:52

మే' డే ను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ

138వ 'మే' డే ను ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి పిలుపునిచ్చారు. సోమవారము నల్లగొండ లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం లో మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాల పునరుద్ధరణకై దేశంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు సయీద్ , సుమతమ్మ, దోటీ వెంకన్న, కొశాదికారి వెంకన్న జిల్లా నాయకులు జానీ, శంకర్,గుండె రవి, వెంకట్ రాములు, కోట్ల శోభ, లెనిన్, మల్లయ్య , నీల వెంకటయ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 21 2024, 19:32

NLG: నామినేషన్ ర్యాలీ మరియు సభను విజయవంతం చేయాలి: గుమ్ముల మోహన్ రెడ్డి

ఈనెల 24న జరిగే నల్లగొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా, నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించి కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీపీ మనిమద్ది సుమన్,తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుప రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు , మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 19 2024, 15:18

కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడెం మండల జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, శుక్రవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరో 400 మంది కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం. దీంతో మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలాన్ని సమకూర్చుకున్నట్లుగా తెలుస్తోంది. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

.

Mane Praveen

Apr 18 2024, 20:28

ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ బంపర్ ఆఫర్

దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మం చేపట్టింది.

ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు విమాన టికెట్ల‌పై 19 శాతం రాయితీ ఇచ్చింది.

ఈ టికెట్ల‌ తో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్ర‌యాణించే వెసులుబాటు కల్పించింది.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Mane Praveen

Apr 18 2024, 18:55

మునుగోడు: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మునుగోడు మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలలో చూపించిన జోష్ మరోసారి పునఃరావతం చేయాలని, భువనగిరి గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, కుంభ అనిల్ కుమార్ రెడ్డి, జనగాం ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డిసీసీ అధ్యక్షులు, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

1 hour and 1 min ago

TG: ఏప్రిల్ 30న పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. 

తెలంగాణ విద్యాశాఖ పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు సిద్దమైంది.రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యాశాఖ దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో ఎగ్జామ్స్ నిర్వహించింది.

అక్కడక్కడా కొన్ని మాల్‌ ప్రాక్టీసింగ్ సంఘటనలు చవిచూసినటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా సజావుగా పరీక్షలను నిర్వహించారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన మరుక్షణం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Mane Praveen

2 hours and 50 min ago

NLG: మర్రిగూడ మండలంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సిపిఎం నాయకులు.

పార్లమెంటు ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి , నిర్వీర్యం చేసే పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుపాలడుగు నాగార్జున అన్నారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో జీఎస్టీ పేర ప్రజలపై అధిక పన్నులు మోపిందని ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందని పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచి పెట్టిందని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. దేశంలో సమతుల్యత లేని అభివృద్ధిని మోడీ చేస్తున్నారని దక్షిణ భారతదేశంలో నిధుల కేటాయింపులు, నీటి కేటాయింపులు ప్రాజెక్టుల నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం లేదని ఆరోపించారు. తీవ్రమైన నిర్లక్ష్యం వివక్షత చూపుతున్నారని తెలిపారు. కేవలం అంబానీ ఆధానీల మెప్పు కోసమే దేశ సంపదను లూటీ చేస్తున్నారని అన్నారు. జీరో అకౌంట్ ద్వారా 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామనే మాట జూట అని అన్నారు. 

ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పంటలకు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. ఏకకాలంలో పంటల రుణమాఫీ రెండు లక్షలు చేయాలని ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని తెలియజేశారు. ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి పేద ప్రజల పక్షాన నికరంగా పోరాడే అభ్యర్థి జహంగీర్ అని అన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేసి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కాగు వెంకటయ్య, చెల్లం ముత్యాలు, నారోజు అంజయ్య,బుర్రి పెంటయ్య, లక్షమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 24 2024, 09:48

NLG: పేదింటి బిడ్డ పెళ్లికి సాయం అందించిన ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం, మాల్ పట్టణంలోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు సేవలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నల్లవెల్లి గ్రామానికి చెందిన జోగు చంద్రయ్య అంధుడు మరియు పేదరికంలో ఉన్నాడు. ఆయన చిన్న కూతురు వివాహానికి ఫౌండేషన్ చైర్మన్ ముత్తు రూ.10,000 ఆర్థిక సహాయంగా అందించారు.

ఈ సందర్బంగా ముత్తు మాట్లాడుతూ.. తన తండ్రి పేరున ఉన్న ఈ ఫౌండేషన్ పేదలకు సహాయాన్ని అందిస్తుందని, ఆకలితో ఉన్న వారికి అండగా ఉంటుందని, ఎవరికి సహాయం కావాలన్నా తమ ఫౌండేషన్ ను సంప్రదించాలని అన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 23 2024, 18:24

13-14 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ:13,14 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ.. రేపు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

కెసిఆర్ నల్లగొండ జిల్లాను నాశనం చేశారని,కేసీఆర్ వల్లనే జిల్లాకి కరువు వచ్చిందని,నీటి జలాలు పంపకంలో జగన్,కేసీఆర్ లాలూచీ పడ్డారని మండి పడ్డారు.భారాస ఒక్క సీట్ కూడా గెలవదని జోష్యం చెప్పారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 22 2024, 19:35

బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ కు అధిక సంఖ్యలో తరలిరండి: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రేపటి నామినేషన్ కార్యక్రమానికి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. భువనగిరి కోట మీద ఎగిరేది బిజెపి జెండానే అని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్. జయశంకర్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు,ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పాల్గొననున్నారని తెలిపారు. జిల్లా నుండి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీలో పాల్గొనాలని కోరారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 22 2024, 18:52

మే' డే ను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ

138వ 'మే' డే ను ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి పిలుపునిచ్చారు. సోమవారము నల్లగొండ లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం లో మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాల పునరుద్ధరణకై దేశంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు సయీద్ , సుమతమ్మ, దోటీ వెంకన్న, కొశాదికారి వెంకన్న జిల్లా నాయకులు జానీ, శంకర్,గుండె రవి, వెంకట్ రాములు, కోట్ల శోభ, లెనిన్, మల్లయ్య , నీల వెంకటయ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 21 2024, 19:32

NLG: నామినేషన్ ర్యాలీ మరియు సభను విజయవంతం చేయాలి: గుమ్ముల మోహన్ రెడ్డి

ఈనెల 24న జరిగే నల్లగొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా, నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించి కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీపీ మనిమద్ది సుమన్,తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుప రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు , మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 19 2024, 15:18

కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడెం మండల జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, శుక్రవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరో 400 మంది కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం. దీంతో మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలాన్ని సమకూర్చుకున్నట్లుగా తెలుస్తోంది. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

.

Mane Praveen

Apr 18 2024, 20:28

ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ బంపర్ ఆఫర్

దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మం చేపట్టింది.

ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు విమాన టికెట్ల‌పై 19 శాతం రాయితీ ఇచ్చింది.

ఈ టికెట్ల‌ తో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్ర‌యాణించే వెసులుబాటు కల్పించింది.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Mane Praveen

Apr 18 2024, 18:55

మునుగోడు: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మునుగోడు మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలలో చూపించిన జోష్ మరోసారి పునఃరావతం చేయాలని, భువనగిరి గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, కుంభ అనిల్ కుమార్ రెడ్డి, జనగాం ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డిసీసీ అధ్యక్షులు, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG